Revanth Reddy: ట్విట్టర్‌లో టీఆర్‌ఎస్‌కు సంబంధించి ఆసక్తికర ట్వీట్‌

Revanth Reddy: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో విభేదాలపై ఆసక్తికర వ్యాఖ్యలు

Update: 2021-06-08 09:54 GMT

ఎంపీ రేవంత్ రెడ్డి (ఫైల్ ఇమేజ్)

Revanth Reddy: ఎంపీ రేవంత్‌రెడ్డి ట్విట్టర్‌లో టీఆర్‌ఎస్‌కు సంబంధించి ఆసక్తికర ట్వీట్‌ నెట్టింట వైరల్ అయింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో విభేదాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రేవంత్. ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాన్ని ట్వీట్‌ చేసిన రేవంత్‌.. హంపి ధూమ్‌ ధామ్‌, కోవర్ట్‌ క్రాంతి కిరణాలతో కకావికలం అంటూ.. టీఆర్‌ఎస్‌ అంతర్గత రాజకీయాలు బట్టబయలు చేశారు. యముడు జగదీ‌శ్‌రెడ్డి గంట కొట్టినట్టేనా..? అంటూ ట్వీట్‌ చేశారు. ఈటల తర్వాత జగదీష్‌రెడ్డి వ్యవహారం బయటకు పొక్కడంతో.. ఇక ఈయన పని కూడా అయిపోయినట్టే అనే అర్థంలో రేవంత్‌ చేసిన ట్వీట్‌.. ఇప్పుడు వైరల్‌ అవుతోంది. 


Tags:    

Similar News