యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆందోళనలో పాల్గొన్నారు. 85వేల కోట్ల విలువైన ఆర్టీసీ ఆస్తులపై కేసీఆర్ ఫ్యామిలీ కన్నేసిందని ఆరోపించిన రేవంత్ టీఆర్ఎస్ ప్రభుత్వం మెడలు వంచైనాసరే ఆర్టీసీని పరిరక్షించుకుంటామని అన్నారు. అయితే, ఆర్టీసీ కార్మికులెవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని, శాంతియుత పోరాటాలతోనే డిమాండ్లను సాధించుకుందామంటూ సూచించారు.