Harish Rao: వంద అబద్దాలు చెప్పి రేవంత్ అధికారంలోకి వచ్చారు

Harish Rao: రైతులను కాంగ్రెస్ ఆగం ఆగం చేస్తుంది

Update: 2024-04-19 01:53 GMT

Harish Rao: వంద అబద్దాలు చెప్పి రేవంత్ అధికారంలోకి వచ్చారు

Harish Rao: పబ్లిసిటీ చేసే నాయకుడు కావాలా.. పని చేసే నాయకుడు కావాలా నిర్ణయించుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు ప్రజలను ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో పార్లమెంట్ అభ్యర్ధి వినోద్ కుమార్ కు మద్దతుగా నిర్వహించిన బహిరంగ సభలో హరీష్ రావు పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే రైతులను ఆగం ఆగం చేసిందని విమర్శించారు. వంద అబద్దాలు చెప్పి రేవంత్ రెడ్డి సీఎం అయ్యారన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని హరీష్ రావు అన్నారు.. బీజేపీకీ ఓటు వేస్తే పేదల నడ్డీ విరుస్తుందని అన్నారు. బీజేపీ ఏమి అభివృద్ధి చేసింది చెప్పుకోవడానికి ఏం లేకనే గుళ్ళు దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు.

Tags:    

Similar News