జన్వాడ డ్రోన్ కేసులో ఎంపీ రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణను రాజేంద్రనగర్ కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. ఆరుగురికి బెయిల్ మంజూరు చేసిన రాజేంద్రనగర్ కోర్టు, రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణను మాత్రం మంగళవారానికి వాయిదా వేసింది.
జన్వాడ డ్రోన్ కేసులో ఎంపీ రేవంత్ రెడ్డితో పాటు మరో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. రేవంత్ కు 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే, మొత్తం ఏడుగురు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా వీరిలో ఆరుగురికి మాత్రమే రాజేంద్రనగర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు రేవంత్ అరెస్ట్పై కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుట్రపూరితంగానే ప్రభుత్వంపై ఆయనపై అక్రమ కేసులో మోపుతోందని కార్యకర్తలు ధర్నాలు నిర్వహిస్తున్నారు.