Raghunandan Rao: అమీన్‌పూర్ మున్సిపాలిటీలో రోడ్ షో నిర్వహించిన రఘునందన్‌రావు

Raghunandan Rao: మూడోసారి ప్రధానిగా మోడీ గెలవబోతున్నారు

Update: 2024-04-22 06:43 GMT

Raghunandan Rao: అమీన్‌పూర్ మున్సిపాలిటీలో రోడ్ షో నిర్వహించిన రఘునందన్‌రావు 

Raghunandan Rao: కమలం గుర్తుకు ఓటేసి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపర్చాలని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు కోరారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం అమీన్ పూర్ మున్సిపాలిటీలో బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు రోడ్ షో చేపట్టారు. ఈ ఎన్నికల్లో మెదక్ నుంచి తనను ఆశీర్వదించాలని కోరారు. పదేళ్ల మోడీ ప్రజా పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాయన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడకు వచ్చిన పేద, మధ‌్యతరగతి ప్రజలు కేంద్రం అందిస్తోన్న సోలార్ విద్యుత్ టవర్‌ను ప్రతీ ఇంటిపై ఏర్పాటు చేసుకుని.. ఉచిత విద్యుత్ ను వాడుకునేందుకు ఇస్తున్న సబ్సిడీని వినియోగించుకోవాలన్నారు.

Tags:    

Similar News