Ragging: ర్యాగింగ్ కేసులో హోంమంత్రి మనవడు

Ragging: తెలంగాణ హోంమంత్రి మహమూద్‌ అలీ మనవడు ర్యాగింగ్ చేశాడ‌ని పోలీసుల‌కు ఫిర్యాదు అందింది.

Update: 2021-03-07 09:24 GMT

ఇమేజ్ సోర్స్ :ఈనాడు.నెట్


Ragging: తెలంగాణ హోంమంత్రి మహమూద్‌ అలీ మనవడు ర్యాగింగ్‌కి పాల్పడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఓ విద్యార్థి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే...మ‌హ‌మూద్ అలీ మనవడు ఫరాన్ హైద‌రాబాద్‌లోని బంజారాహిల్స్‌ రోడ్‌ నం.3లోని ముఫకంజా ఇంజినీరింగ్ కాలేజీలో థ‌ర్డ్ ఇయ‌ర్ చ‌దువుతున్నాడు.

అదే కాలేజీకి చెందిన బీటెక్‌ విద్యార్థి రియాన్‌ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. త‌మ‌ను ఫ‌రాన్ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని మ‌రికొంద‌రు విద్యార్థులు మీడియాకు తెలిపారు. త‌మ చేతిక‌యిన ‌గాయాల‌ను చూపించారు. అతడి నుంచి తమను కాపాడాలని కోరారు. స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

Tags:    

Similar News