మడ్గి చెక్పోస్టు వద్ద ట్రావెల్ బస్సు నిలిపివేత.. బస్సులో తెలంగాణకు వస్తున్న 37మంది..
జనతా కర్ఫ్యూ నేపథ్యంలో తెలంగాణ సరిహద్దులో ముమ్మర తనిఖీలు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా మడ్గి చెక్పోస్టు వద్ద ముంబై నుంచి వచ్చిన ట్రావెల్ బస్సును నిలిపివేశారు. 37మంది దుబాయ్ నుంచి ముంబై వచ్చి అక్కడి నుంచి బస్సులో వస్తున్నట్లు జిల్లా అధికారులు గుర్తించారు. జిల్లాలోకి రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. వీరందరికీ వైద్యులు పరీక్షలు చేస్తున్నారు.