పె‌ళ్లిని అడ్డుకున్న పురోహితుడు

Update: 2019-06-19 08:22 GMT

వివాహానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంత్రోచ్చరణలకు మండపం సిద్ధమైంది. అఖరి నిమిషంలో పె‌ళ్లి ఆపమనే డైలాగ్ వినిపించింది. సినిమాల్లో చూసి ఏ పోలీసులో, పెళ్లి కూతురో మరోకరు ఆ పెళ్లికి ఆటంకం కలిగించలేదు. పురోహితుడే స్వయంగా పెళ్లి అడ్డుకున్నాడు. స్ధానికంగా ఉన్న తనను కాకుండా ఎక్కడి నుంచో మరో పురోహితుడిని ఎలా తీసుకొస్తారంటూ వాదులాటకు దిగాడు. వరంగల్ జిల్లా నెక్కొండలో ఈ ఘటన చోటు చేసుకుంది.

పట్టణంలోని పంక్షన్ హాల్లో వివాహ వేడకకు ఏర్పాట్ల పూర్తయ్యాయి. కాసేపట్లో మంత్రోచ్ఛరణలకు సిద్దమవుతుండగా స్ధానిక పురోహితుడు శివరామకృష్ణ, అతని కుమారుడు అఖిల్‌ వచ్చి అడ్డుకున్నారు. ఈ ప్రాంతంలో తామే పౌరహిత్యం నిర్వహించాలని తమను కాదని పెళ్లి చేయడానికి వీలు లేదంటూ వివాహ కార్యక్రమాలను అడ్డుకున్నారు. సర్ధి చెప్పేందుకు ప్రయత్నించినా వినక పోవడంతో సహనం నశించిన పెళ్ళి పెద్దలు పురోహితుడికి దేహవుద్ధి చేశారు. పరిస్ధితులు చేయి దాటి పోవడంతో విషయం తెలుసుకున్న పోలీసులు పురోహితుడితో పాటు అతని కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో వివాహం కాస్త ఆలస్యంగానైనా జరిగింది. 

Tags:    

Similar News