Hyderabad: బాలానగర్ ఫ్లైఓవర్‌పై ప్రజాపాలన దరఖాస్తులు..

Hyderabad: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ మండలానికి చెందిన దరఖాస్తులుగా గుర్తింపు

Update: 2024-01-09 08:47 GMT

Hyderabad: బాలానగర్ ఫ్లైఓవర్‌పై ప్రజాపాలన దరఖాస్తులు.. 

Hyderabad: తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన-ఆరు గ్యారెంటీలు కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా.. లబ్దిదారుల నుంచి ఆరు గ్యారెంటీల అప్లికేషన్స్‌ను స్వీకరించింది. అయితే.. హైదరాబాద్ బాలానగర్ ఫ్లైఓవర్‌ పై ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తులు దర్శనమివడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ మండలానికి చెందిన దరఖాస్తులు.. ర్యాపిడో వెహికల్‌పై తరలిస్తుండగా.. దరఖాస్తు ఫారాలు రోడ్డుపై పడ్డాయి. సోషల్‌ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News