Congress: కాంగ్రెస్‌లోకి జూపల్లి, పొంగులేటి..?

Congress: రాహుల్‌ గాంధీతో జూమ్‌లో మాట్లాడిన పొంగులేటి, రేవంత్‌రెడ్డి

Update: 2023-06-17 10:26 GMT

Congress: కాంగ్రెస్‌లోకి జూపల్లి, పొంగులేటి..?

Congress: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. పొంగులేటి, రేవంత్‌రెడ్డి రాహుల్‌ గాంధీతో జూమ్‌లో మాట్లాడినట్లు సమాచారం. అయితే కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ రాహుల్‌తో జూమ్ సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీలో చేరికపై నేతలు చర్చించుకున్నారు. ఇక ఈనెల 21న టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. చేరికల అనంతరం ఖమ్మం, మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభలు నిర్వహించనుంది.

Tags:    

Similar News