Hyderabad: మహంకాళి బోనాల జాతరలో రాజకీయ వివాదం

* బీజేపీ నేతలను అవమానపరుస్తున్నారని ఆరోపణ * పోస్టర్‌లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఫోటో లేదని ఆరోపణ

Update: 2021-07-21 05:47 GMT

మహంకాళి బోనాల జాతర

Hyderabad: ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతరను రాజకీయ వివాదం చుట్టుముడుతోంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రోటోకాల్ అమలు చేయడం లేదంటూ బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, లోకల్ కార్పొరేటర్ సుచరిత శ్రీకాంత్ ఫోటోలు లేకుండా పోస్టర్ రిలీజ్‌ చేయడాన్ని బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఎండోమెంట్ కమిషనర్‌కు లేఖ కార్పొరేటర్ రాంగోపాల్ లేఖ రాశారు. బీజేపీ నాయకులను రాష్ట్ర ప్రభుత్వం కావాలనే అవమానిస్తుందని లేఖలో పేర్కొన్నారు.

Tags:    

Similar News