పోలీసుల కోర్టు ధిక్కరణ : సీపీ, ఏసీపీ, సీఐలకు జైలు శిక్ష

Update: 2019-09-27 12:11 GMT

కోర్టు ధిక్కరణ కేసులో పోలీసు అధికారులకు తెలంగాణ హైకోర్టు జైలు శిక్ష విధించింది. కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి, ఏసీపీ తిరుపతి, సీఐ శశిధర్ రెడ్డికి 6నెలల జైలుశిక్ష, 10 వేలు జరిమానా విధించింది. రమ్మీ ఆడుతూ, తన రిసార్ట్స్ లోకి వచ్చి వేధిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే జగపతి రావు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై గతంలో హైకోర్టు పోలీసులకు పలు ఆదేశాలు జారీ చేశారు. కోర్టు ఆదేశాలు పాటించని అధికారులపై కోర్టు ధిక్కారణ కేసులో జైలు శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 

Full View

Tags:    

Similar News