K Laxman: మోడీ ప్రదాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారు

K Laxman: రాహుల్ కు వయస్సు పెరుగుతుంది తప్పితే మెచ్యూరిటీ తగ్గుతుంది

Update: 2024-04-19 03:06 GMT

K Laxman: మోడీ ప్రదాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారు

K Laxman: తెలంగాణలో తొలి రోజు నామినేషన్ల పర్వం చూస్తుంటే జూన్ 4న విజయకేతనం ర్యాలీ నిర్వహించినట్లు ఉందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే.లక్ష్మణ్ అన్నారు. అన్ని పార్టీల సానుభూతి పరులు మోడీని మూడోసారి ప్రధాని కావాలని ఉవ్విళ్లూరుతున్నారని చెప్పారు. రాహుల్ గాంధీ వయస్సు పెరుగుతుంది తప్పితే మెచ్యూరిటీ తగ్గుతుందని అనన్నారు. మోడీ సాహసోపేతమైన నిర్ణయాలపై మాట్లాడేందుకు రాహుల్ గాంధీకి నోరు రావడం లేదన్నారు. ఈడీ, సిబీఐలను అడ్డుపెట్టుకుని బిజెపి విరాళాలు సేకరిస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించడం సిగ్గు చేటన్నారు. ఓటమి కోసం కారణాలు ఎత్తుకునేందుకు ఎలక్ట్రోరల్ బాండ్లు, ఈవీఎంల ట్యాంపరింగ్ అంటున్నారని అన్నారు. రాహుల్ గాంధీ ఆరోపణల్లో ఏ మాత్రం పస లేదని లక్ష్మణ్ అన్నారు.

Tags:    

Similar News