Palla Rajeshwar Reddy: మా కుటుంబ సభ్యులపై తీన్మార్‌ మల్లన్న అసత్య ఆరోపణలు చేస్తున్నారు

Palla Rajeshwar Reddy: ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు -ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి

Update: 2024-01-08 15:45 GMT

Palla Rajeshwar Reddy: మా కుటుంబ సభ్యులపై తీన్మార్‌ మల్లన్న అసత్య ఆరోపణలు చేస్తున్నారు

Palla Rajeshwar Reddy: కాంగ్రెస్‌ నేతలు బీఆర్ఎస్‌ పార్టీపై అసత్యాలు, అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. ఓడిన కాంగ్రెస్‌ నాయకులు ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. తమ కుటుంబ సభ్యులపై తీన్మార్‌ మల్లన్న అసత్య ఆరోపణలు చేస్తున్నారని..దొంగతనంగా తన భార్యకు ప్రభుత్వం ఉద్యోగం వచ్చిన ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తీన్మార్‌ మల్లన్నపై పరువు నష్ట దావా వేస్తానని అన్నారు. ప్రజావాణీలో తీన్మార్‌ మల్లన్నపై ప్రజలు ఫిర్యాదు చేసినా.. ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.

Tags:    

Similar News