YS Sharmila: లోటస్‌పాండ్‌లో కొనసాగుతున్న షర్మిల దీక్ష

YS Sharmila: షర్మిల ఆరోగ్యం క్షీణిస్తోంది -డా.చంద్రశేఖర్‌రెడ్డి * షుగర్‌ లెవెల్స్‌ బాగా తగ్గాయి -డా.చంద్రశేఖర్‌రెడ్డి

Update: 2021-04-18 01:44 GMT

వైస్ షర్మిల దీక్ష (ఫైల్ ఇమేజ్)

YS Sharmila: తెలంగాణలో ఉద్యోగాల భర్తీ చేపట్టాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో వైఎస్‌ షర్మిల చేపడుతున్న దీక్ష కొనసాగుతోంది. షర్మిలకు వైద్య పరీక్షలు నిర్వహించారు డాక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి. ఆమె ఆరోగ్యం క్షిణిస్తోందని, షుగర్‌ లెవెల్స్ కూడా బాగా తగ్గాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం షర్మిల పల్స్‌రేట్‌ నార్మల్‌గా ఉందన్నారు డాక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి. ఇక.. ఇవాళ వైఎస్‌ షర్మిల దీక్ష విరమిస్తారని తెలుస్తోంది.

Tags:    

Similar News