హైదరాబాద్‌లో వన్ ప్లస్‌ Rఅండ్D సెంటర్‌ ప్రారంభం

Update: 2019-08-26 11:30 GMT

హైదరాబాద్‌లో మాన్యుఫాక్చరింగ్‌ సెంటర్‌ను నెలకొల్పాలని వన్ ప్లస్‌ కంపెనీని టీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. నానక్‌రాంగూడలో వన్ ప్లస్‌ కంపెనీ ఆర్ అండ్ డీ సెంటర్‌ను ప్రారంభించిన కేటీఆర్... ఈ కేంద్రం ద్వారా వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడులతోపాటు 12వందల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపారు. అయితే, మాన్యుఫాక్చరింగ్‌ సెంటర్‌ను ఏర్పాటుచేస్తే, ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని కేటీఆర్ అన్నారు. ప్రీమియం ఫోన్ల మార్కెట్‌లో వన్ ప్లస్‌ లీడర్‌గా మారిందని, రానున్న రోజుల్లో 5జీతోపాటు మరెన్నో కొత్త టెక్నాలజీపై పనిచేస్తున్నట్లు వన్ ప్లస్‌ ప్రతినిధులు తెలిపారు.

Tags:    

Similar News