నిర్మల్‌ బీజేపీ అధ్యక్షురాలు రమాదేవి భావోద్వేగం

Nirmal BJP : బీజేపీ పార్టీ మోసం చేసిందంటూ కంటతడి

Update: 2023-10-23 03:06 GMT

నిర్మల్‌ బీజేపీ అధ్యక్షురాలు రమాదేవి భావోద్వేగం

Nirmal BJP : నిర్మల్‌ బీజేపీ అధ్యక్షురాలు రమాదేవి భావోద్వేగానికి గురయ్యారు. బీజేపీ పార్టీ తనను మోసం చేసిందంటూ కంటతడి పెట్టుకున్నారు. కన్నతల్లి లాంటి బీజేపీ పార్టీ.. తనకు అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో రెండుసార్లు రెండోస్థానంలో నిలిచిన తనను కాదని, కొత్త వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారంటూ బీజేపీపై ప్రశ్నల వర్షం కురిపించారు. త్వరలో బీజేపీకి రాజీనామా చేస్తానన్న ఆమె.. వచ్చే ఎన్నికల్లో తాను కూడా ఎన్నికల బరిలో నిలుస్తానని హెచ్చరించారు. ముధోల్ నియోజకవర్గ ప్రజలు తనను ఆశీర్వదించాలని కోరారు రమాదేవి.

Tags:    

Similar News