ప్రేమ పెళ్లి వద్దాన్నారని ప్రాణం తీసుకున్నారు..

Update: 2020-02-18 11:05 GMT
ప్రేమ పెళ్లి వద్దాన్నారని ప్రాణం తీసుకున్నారు..

యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పురుగు మందు తాగి నవదంపతుల ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఈ ఘటనలో భర్త మృతి చెందగా, భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్న వీరు ప్రాణహాని ఉందనే భయంతోనే ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని తెలుస్తోంది.

ఈనెల 16న ప్రేమ వివాహం చేసుకున్నారు. వారి పెళ్లి కుటుంబాలకు ఇష్టం లేదు కుటుంబం నుంచి ప్రాణహాని ఉందని భయపడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలో ఏమైందో ఏమో తెలియదు. యాదాద్రి భువనగిరి శివారులోని ఓ హోటల్‌లో అలకుంట్ల స్వామి, ఉమారాణి పురుగు మందు తాగారు. ఈ ఘటనలో భర్త స్వామి మృతి చెందగా భార్య పరిస్థితి విషమంగా ఉంది. నవదంపతులు వలిగొండ మండలం జంగారెడ్డిపల్లికి చెందిన వారిగా గుర్తించారు. స్వామి ఘటకేసర్‌‌లో కంప్రెషర్ వాహనం నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. 

Tags:    

Similar News