దివ్య హత్య కేసు అనుమానితుడు వెంకటేశంను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. సిరిసిల్ల జిల్లా వేములవాడలో వెంకటేశంను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే విచారణ నిమిత్తం వెంకటేశంను సిద్దిపేట పోలీస్ కమిషనరేట్కు తరలించినట్లు తెలుస్తోంది.
మరోవైపు ఈ హత్య కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. తనను పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానని గతంలో చాలా సార్లు దివ్యను వెంకటేశం బెదిరించాడని దివ్య తండ్రి తెలిపాడు. డిగ్రీ చదువుతున్న సమయంలో పెళ్లి చేసుకోకపోతే చనిపోతానని కిరోసిన్ పోసుకొని వేధింపులకు గురి చేశాడని దివ్య తండ్రి లక్ష్మీరాజ్యం చెప్పుకొచ్చాడు.