Nizamabad: నిజామాబాద్ జిల్లాలో నవవధువు ఆత్మహత్యలో వీడిన మిస్టరీ

Nizamabad: రవళి చావుకు వరుడు సంతోష్‌ కారణమని తేల్చిన పోలీసులు

Update: 2022-12-22 09:38 GMT

 నిజామాబాద్ జిల్లాలో నవవధువు ఆత్మహత్యలో వీడిన మిస్టరీ

Nizamabad: నిజామాబాద్ జిల్లాలోని నవీపేటలో నవవధువు రవళి ఆత్మహత్యలో మిస్టరీ వీడింది. డిసెంబర్ 11న పెళ్లి జరగాల్సి ఉండగా కొన్ని గంటలకు ముందు రవళి సూసైడ్ చేసుకోవడం ఆరోజు కలకలం రేపింది. అయితే ఈ ఆత్మహత్యకు వరుడు సంతోష్ కారణమని పోలీసులు తేల్చారు. పెళ్లి తర్వాత తప్పనిసరిగా జాబ్ చేయాలని చెప్పడంతో పాటు..ఆమె తండ్రి పేరుమీద ఉన్న ఆస్తి తన పేరుకు మార్చాలని ఒత్తిడి చేయడంతో మనస్థాపంతో రవళి ఆత్యహత్య చేసుకున్నట్లు తేలింది. సంతోష్ కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు దీనిపై మరింతగా విచారించి సంతోష్‌ను నిందితుడిగా తేల్చారు. అతనిపై పలు కేసులతో కూడిన ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News