Exit Polls: మునుగోడు ఉపఎన్నిక ఎగ్జిట్ పోల్స్.. ఆ పార్టీకే భారీ ఆధిక్యం..!

Exit Polls: ఓవైపు గులాబీ దండు.. మరోవైపు కాషాయ దళం.. అటు కాంగ్రెస్ శ్రేణులు.. దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది.

Update: 2022-11-03 14:14 GMT

Exit Polls: మునుగోడు ఉపఎన్నిక ఎగ్జిట్ పోల్స్.. ఆ పార్టీకే భారీ ఆధిక్యం..!

Exit Polls: ఓవైపు గులాబీ దండు.. మరోవైపు కాషాయ దళం.. అటు కాంగ్రెస్ శ్రేణులు.. దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక, మునుగోడు ఎన్నికలపై ఎగ్జిట్ పోల్ సర్వేలు తమ నివేదికలను వెల్లడిస్తున్నాయి. ఎన్నికల సరళిపై పలు సర్వేలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. దీంతో గెలుపు ఎవరిది అనే దానిపై ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోయాయి. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్‌లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ పోరుమాత్రమే ఉందని తేలుతోంది. కాంగ్రెస్ మూడో స్థానంలోకి పడిపోయిందని సమాచారం. ఈ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఫలితాలు అధికార పార్టీ టీఆర్ఎస్‭కు అనుకూలంగానే ఉండనున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. 

థర్డ్‌ విజన్‌ రీసెర్చ్‌- నాగన్న ఎగ్జిట్‌పోల్స్‌ సర్వే ప్రకారం..

టీఆర్‌ఎస్‌- 48-51 శాతం

బీజేపీ- 31-35 శాతం

కాంగ్రెస్‌- 13-15 శాతం

బీఎస్పీ- 5-7 శాతం

ఇతరులు- 2-5 శాతం.

ఎస్‌ఏఎస్‌ గ్రూప్‌ ఎగ్జిట్‌పోల్‌ సర్వే ప్రకారం..

టీఆర్‌ఎస్‌- 41-42 శాతం

బీజేపీ- 35-36 శాతం

కాంగ్రెస్‌- 16.5-17.5 శాతం

బీఎస్పీ- 4-5 శాతం

ఇతరులు- 1.5-2 శాతం.

నేషనల్‌ ఫ్యామిలీ ఒపీనియన్‌ ఎగ్జిట్‌పోల్‌ సర్వే ప్రకారం..

టీఆర్‌ఎస్‌- 42.11 శాతం

బీజేపీ- 35.17 శాతం

కాంగ్రెస్‌- 14.07 శాతం

బీఎస్పీ- 2.95 శాతం

ఇతరులు- 5.70 శాతం.

Tags:    

Similar News