మునుగోడు బైపోల్‌పై గులాబీ బాస్‌ ఫోకస్‌

దసరా రోజున మునుగోడు అభ్యర్థి అధికారిక ప్రకటన

Update: 2022-10-04 03:05 GMT

మునుగోడు బైపోల్‌పై గులాబీ బాస్‌ ఫోకస్‌

CM KCR: మునుగోడు బైపోల్‌పై గులాబీ బాస్‌ ఫోకస్‌ పెట్టారు. మంత్రులు కేటీఆర్‌, హరీష్‌ సహా పలువురు నేతలకు మునుగోడు బాధ్యతలు అప్పగించారు. దసరా రోజున మునుగోడు అభ్యర్థి అధికారిక ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో మునుగోడు ఇన్‌ఛార్జీలకు అధిష్టానం నుంచి ఫోన్‌ కాల్స్‌ వెళ్లినట్టు తెలుస్తోంది. 6వ తేదీ నుంచి స్థానికంగా అందుబాటులో ఉండాలని ఆదేశాలు అందినట్టు సమాచారం. ఇక.. నియోజకవర్గాన్ని 86 యూనిట్లుగా విభజించి, ఒక్కో ఎమ్మెల్యేకు ఒక్కో యూనిట్‌ను అప్పగించనున్నారు. ఎన్నికల ప్రచారం చివరిరోజు వరకు అక్కడే ఉండాలని ఆదేశించారు. మరోవైపు చండూరులో సీఎం కేసీఆర్‌ సభకు ప్లాన్‌ చేస్తున్నారు.

Tags:    

Similar News