ఎంపీ, పోలీసుల మధ్య వివాదం.. సీపీ ప్రకటనతో అదనపు భద్రతను తిప్పి పంపిన ఎంపీ
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్- పోలీసుల మధ్య మరో వివాదం నెలకొంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ బండి సంజయ్పై జరిగిన రాళ్లదాడి లాంటి ప్రచారాలు అవాస్తవమంటూ కరీంనగర్ సీపీ కమలాసన్రెడ్డి ప్రకటన రిలీజ్ చేశారు. సీపీ ప్రకటనతో ఎంపీ బండి సంజయ్ తనకు కల్పించిన అదనపు భద్రతను తిప్పి పంపించారు. కొత్తగా ఇచ్చిన బాంబ్ స్వ్కాడ్, ఎస్కార్ట్ను వెనక్కు పంపించేశారు. అయితే రాళ్లదాడి ప్రచారం నేపథ్యంలో రెండు రోజుల క్రితం ఆయనకు పోలీసులు అదనపు భద్రతను కల్పించారు.