Medak: ఎమ్మెల్యే ను కలిసిన మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్

నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్ తూడుపు నోరి చంద్రపాల్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ని హైదరాబాద్ లోని తన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Update: 2020-02-01 11:22 GMT

మెదక్: నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్ తూడుపు నోరి చంద్రపాల్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ని హైదరాబాద్ లోని తన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కౌన్సిలర్లు ఎన్నికైన అనంతరం మొదటిసారిగా ఎమ్మెల్యేలను కలిసి తమ గెలుపు సహకరించిన ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ... ఎలాంటి గ్రూపు రాజకీయాలు లేకుండా ప్రజల కోసం పని చేయాలని ముఖ్యంగా ప్రజల నమ్మకముతో గెలుపొందిన మీరు ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేయాలని అన్నారు. ఎలాంటి అవినీతికి, గ్రూపు రాజకీయాలకు చోటు లేకుండా ఉండాలని ఆమె కౌన్సిలర్ లకు సూచించారు.


Tags:    

Similar News