CEO Vikas Raj: తెలంగాణలో ఎంపీ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది

CEO Vikas Raj: అభ్యర్థులు తమ నామినేషన్లను ఆన్‌లైన్‌లో కూడా సమర్పించవచ్చు

Update: 2024-04-18 14:25 GMT

CEO Vikas Raj: తెలంగాణలో ఎంపీ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది

CEO Vikas Raj: తెలంగాణలో ఎంపీ ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైందన్నారు ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్. అభ్యర్థులు తమ నామినేషన్లను ఆన్‌లైన్‌లో కూడా సమర్పించవచ్చని తెలిపారు.నామినేషన్ పత్రాల ప్రింట్లను ఏప్రిల్ 24వ తేదీలోపు రిటర్నింగ్‌ ఆఫీసర్‌కు అందజేయాలని సూచించారు. అభ్యర్థుల క్రిమినల్ కేసుల వివరాలను ప్రసార, ప్రచార మాధ్యమాల్లో టెలికాస్ట్ చేయాలని సూచించారు. నామినేషన్ పత్రాలు, అఫిడవిట్ల కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని ఆర్వోలను ఆదేశించినట్లు తెలిపారు సీఈవో వికాస్‌రాజ్.

Tags:    

Similar News