గాజులరామారంలో బాధితులకు ఎంపీ ఈటల పరామర్శ
గాజులరామారంలో బాధితులకు ఎంపీ ఈటల పరామర్శ పేదల ఇండ్లను కూలగొట్టడం దారుణం - ఎంపీ ఈటల
గాజులరామారంలో బాధితులకు ఎంపీ ఈటల పరామర్శ
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజుల రామారం, బాలయ్య, గాలిపోచమ్మ బస్తీలో బాధితులను ఎంపీ ఈటల రాజేందర్ పరామర్శించారు. హైడ్రా అధికారులు పేదల ఇండ్లను కూలగొట్టారంటూ అధికారులను తప్పుబట్టారు. పెద్దలు కబ్జా చేసిన వెంచర్లు, అపార్ట్మెంట్లను వదిలేసి...కూలీనాలీ చేసి జీవనం గడిపేవారిపై కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇండ్లు కూలగొట్టిన పేదలకు ప్రభుత్వం న్యాయం చేయాలని ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.