జేపీ నడ్డాను విమర్శించే స్థాయి కేటీఆర్కే లేదన్నారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. నిజామాబాద్కు వచ్చి చూస్తే బీజేపీ ఎక్కడుందో కేటీఆర్కు తెలుస్తుందన్నారు. నిజామాబాద్ లో కవితను ఓడించిన ప్రజలు రానున్న రోజుల్లో సిరిసిల్లలో కేటీఆర్ను ఓడించే రోజు దగ్గర్లో ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీదే అధికారం అన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్.