Jannepalli Shivalayam: జన్నేపల్లి శివాలయానికి మహర్దశ

Update: 2021-03-01 14:51 GMT

ఎమ్మెల్సీ కవిత

Jannepalli Shivalayam: నిజామాబాద్‌ జిల్లా జన్నేపల్లిలో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పునర్ నిర్మించిన శివాలయాన్ని టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఈ రోజు ప్రారంభించారు. 200 కార్ల భారీ ర్యాలీతో జన్నేపల్లికి వచ్చిన కవిత, మైనంపల్లికి జన్నేపల్లి శివాలయం పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

జన్నేపల్లి శివాలయం ప్రారంభోత్సవంలో టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. అలాగే, వేలాదిగా భక్తులు తరలివచ్చారు. పూజా కార్యక్రమాల అనంతరం... శివాలయాన్ని ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు.

Tags:    

Similar News