ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రతి ఒక్కరు సహకరించాలి: ఎమ్మెల్యే శానంపూడి

హుజూర్ నగర్ లో ప్లాస్టిక్ ను నివారించడానికి జర్నలిస్టులు ఏర్పాటుచేసిన గుడ్డ సంచులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి.

Update: 2019-12-04 05:14 GMT
ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, జర్నలిస్టులు రమేష్ రెడ్డి

హుజూర్ నగర్: హుజూర్ నగర్ లో ప్లాస్టిక్ ను నివారించడానికి జర్నలిస్టులు ఏర్పాటుచేసిన గుడ్డ సంచులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి. ఈ సందర్భంగా గా హుజూర్నగర్ ప్లాస్టిక్ రహిత హుజూర్నగర్ గా మార్చేందుకు ప్రతి ఒక్కరు పాటుపడాలని కోరారు.

పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్ కవర్ల ను పూర్తిస్థాయిలో నిషేధించి చేస్తున్న ఈ యజ్ఞంలో ప్రజలంతా పాల్గొని ప్లాస్టిక్ నివారించేందుకు తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు అందించిన గుడ్డ సంచులను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు రమేష్ రెడ్డి, రాజా రమేష్, క్రాంతి, శ్రీనివాస్, ఉషశ్రీ, రఫీ, చంద్రమౌళి, మధు, మహేష్, లక్ష్మణ్, జానీ, విశాఖ తదితరులు పాల్గొన్నారు.


Tags:    

Similar News