Medipally Sathyam: ప్రతీ ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిది
Medipally Sathyam: చొప్పదండి నియోజకవర్గంలో ఒక్క గుంట కూడాఎండిపోదు
Medipally Sathyam: కరీంనగర్ జిల్లా షానగర్లో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నీటిని విడుదల చేశారు. చొప్పదండి ప్రజల నీటి అవసరాలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగానే స్పందించి ఇరిగేషన్ అధికారులతో రివ్యూ చేసి నీటిని విడుదల చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. చొప్పదండి నియోజకవర్గంలో ఒక్క గుంట కూడా ఎండిపోకుండా చూస్తానని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చెప్పారు.