Telangana: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సవాల్‌ విసిరిన జడ్చర్ల ఎమ్మెల్యే

Telangana: ఆరు నెలలు అధికారం అప్పగిస్తాం- మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

Update: 2021-09-04 08:22 GMT

ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి (ఫోటో ది హన్స్ ఇండియా)

Telangana: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సవాల్ విసిరారు. ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని యువతను తప్పుదోవ పట్టిస్తున్నారన్న ఆయన ప్రతిపక్షాలకు ఆరు నెలలు అధికారం ఇస్తాం దమ్ముంటే కేంద్ర పార్టీ నాయకత్వంతో మాట్లాడి లెటర్ ఇవ్వండని సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఇప్పటికే తమ ప్రభుత్వం లక్షా 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని మరో 50 వేల ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. జనాభా ప్రాతిపదికన ఒక శాతం ఉద్యోగాలు మాత్రమే రాష్ట్రంలో ఇస్తారని అన్నారు. మరో వైపు దేశంలో ఆయా రాష్ట్రాలలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అధికారంలో ఉన్నా అక్కడ ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదని దమ్ముంటే ఆరు నెలల పాటు మీకు అధికారాన్ని ఇస్తాం రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం ఇస్తారా అంటూ సవాల్ విసిరారు.

Tags:    

Similar News