Kale Yadaiah: గడగడపకు వెళ్లి సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే యాదయ్య

Kale Yadaiah: సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చి దిద్దడమే లక్ష్యం

Update: 2022-11-22 07:11 GMT

Kale Yadaiah: గడగడపకు వెళ్లి సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే యాదయ్య

Kale Yadaiah: గ్రామ సమస్యలు పరిష్కరించడానికే శుభోదయం కార్యక్రమం నిర్వహిస్తున్నామని.. ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కమ్మెట, గొల్లగూడ గ్రామాల్లో రెండవ విడత శుభోదయం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఇందులో భాగంగా గ్రామాల్లోని గడప గడపను సందర్శించి అక్కడి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తన దృష్టి వచ్చిన చిన్నచిన్న సమస్యలకు వెనువెంటనే పరిష్కారం చూపారు. అంతేకాకుండా.. మిగతా సమస్యలు నోట్ చేసుకున్న ఎమ్మెల్యే.. పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. శుభోదయం కార్యక్రమం ద్వారా చేవెళ్ల నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోని ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని త్వరగా పరిష్కారాలు చూపుతామన్నారు. సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకే ఈకార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఈరోజు శుభోదయం కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలె యాదయ్యతోపాటు ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ప్రభాకర్, సర్పంచులు, ఎంపీటీసీలు, టిఆర్ఎస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Full View
Tags:    

Similar News