జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయం: మంత్రి వేముల

Update: 2020-11-14 11:07 GMT

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి. ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీ శంబిపూర్‌రాజుతో మంత్రి వేముల సమావేశమయ్యారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని 8 డివిజన్లలో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విస్తృత ప్రచారం చేసేలా ప్రణాళిక సిద్ధం చేయాలని ఈ సందర్భంగా మంత్రి వేముల అభిప్రాయపడ్డారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కలిసికట్టుగా, బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు మంత్రి వేముల. ‎

Tags:    

Similar News