జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది : కేటీఆర్

కార్పొరేటర్లతో సమావేశంలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, పార్టీ కేడర్ సిద్ధంగా ఉండాలంటూ సంచలన కామెంట్స్ చేశారు.

Update: 2020-12-06 12:30 GMT

కార్పొరేటర్లతో సమావేశంలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, పార్టీ కేడర్ సిద్ధంగా ఉండాలంటూ సంచలన కామెంట్స్ చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో మన ప్రయత్నంలో లోపం లేదన్న కేటీఆర్, ఎమోషన్ ఎలక్షన్ జరిగిందని, అందుకే ఇలాంటి ఫలితం వచ్చిందన్నారు. సిట్టింగ్ లను మార్చిన దగ్గర టీఆర్ఎస్ గెలిచిందన్న మంత్రి, మార్చని చోట సిట్టింగ్ కార్పొరేటర్లు చాలామంది ఓడిపోయారన్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి రిపీట్ అయ్యే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. గ్రేటర్ ఫలితాలను గుణాపాఠంగా తీసుకుని వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు లోపాలు సరిదిద్దుకోవాలని కేడర్ కు దిశానిర్ధేశం చేశారు. మరోవైపు 8న జరగబోయే భారత్ బంద్ ను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ నేతలను మంత్రి కేటీఆర్ కోరారు. ఢిల్లీ పెద్దల దిమ్మతిరిగేలా తెలంగాణ బంద్ విజయవంతం చేయాలన్న ఆయన.. తెలంగాణ ఉద్యమాన్ని తలపించేలా గల్లీగల్లీ బంద్ సక్సెస్ కావాలన్నారు. ప్రతీ కార్యకర్త భారత్ బంద్‎లో పాల్గొనాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

Tags:    

Similar News