KTR: రేవంత్‌రెడ్డికి మంత్రి కేటీఆర్‌ మరో సవాల్‌

KTR: ఢిల్లీ ఎయిమ్స్‌లో ఏ రకం పరీక్షకైనా సిద్ధం, రాహుల్‌ వస్తాడా..?

Update: 2021-09-20 05:07 GMT
రేవంత్ రెడ్డికి మంత్రి కేటీఆర్ (ఫైల్ ఇమేజ్)

KTR: టీ.పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డికి మంత్రి కేటీఆర్‌ మరో సవాల్‌ విసిరారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో ఏ రకం పరీక్షకైనా తాను సిద్ధమన్న మంత్రి కేటీఆర్‌, రాహుల్‌ గాంధీ వస్తాడా అంటూ ప్రశ్నించారు. చర్లపల్లి బ్యాచ్‌తో టెస్టులు చేసుకుంటే తన గౌరవం తగ్గుతుందని ట్వీట్‌ చేసిన కేటీఆర్‌ తనకు చేసిన టెస్ట్‌లో క్లీన్‌చిట్‌ వస్తే పదవికి రాజీనామా చేసి రేవంత్‌ క్షమాపణ చెప్తాడా అంటూ క్వశ్చన్‌ వేశారు. అంతేకాదు.. ఓటుకు కోట్లు కేసులో లై డిటెక్టర్‌ పరీక్షకు సిద్ధమా అంటూ రేవంత్‌కు సవాల్‌ విసిరారు కేటీఆర్‌.

Tags:    

Similar News