Etela Rajender: వైద్యారోగ్య శాఖ అధికారులతో మంత్రి ఈటల టెలీకాన్ఫరెన్స్‌

Etela Rajender: కోవిడ్ పరిస్థితులు, చికిత్సపై వైద్యారోగ్య శాఖ అధికారులతో మంత్రి ఈటల టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

Update: 2021-04-25 14:50 GMT

ఈటల రాజేంధర్ (ఫొటో ట్విట్టర్)

Etela Rajender: కోవిడ్ పరిస్థితులు, చికిత్స ఏర్పాట్లపై తెలంగాణ వైద్యారోగ్య శాఖ అధికారులతో మంత్రి ఈటల రాజేంధర్ టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రాణాలు ఫణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న వైద్యశాఖ ఉద్యోగులను అభినందించారు మంత్రి.

గతంలో కంటే వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతుందన్న మంత్రి..హోం ఐసోలేషన్‌లో ఉన్న వారిని రెండు రోజులకోసారి పరీక్షించాలన్నారు. ప్రైవేట్ హాస్పిటళ్లలో చికిత్సలను పర్యవేక్షించాలన్నారు. అవసరమైతే ప్రైవేట్ హాస్పిటల్స్‌కు ఆక్సిజన్ అందించే ఏర్పాట్లు కూడా చేద్దామని తెలిపారు.

Tags:    

Similar News