Harish Rao: డయాగ్నొస్టిక్ సెంటర్‌లు ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

Harish Rao: కోటి 60 లక్షలతో నూతన డయాగ్నొస్టిక్ హబ్: హరీష్ రావు

Update: 2021-06-09 08:00 GMT

డయాగ్నొస్టిక్ సెంటర్ ప్రారంబించిన హరీష్ రావు( ఫైల్ ఇమేజ్)

Harish Rao: తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోందని ఆర్ధికశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్‌ను ఆర్టీపీసీఆర్ టెస్టింగ్‌ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 19 డయాగ్నొస్టిక్ కేంద్రాలను సీఎం మంజూరు చేసారని త్వరలో మరో 16 కేంద్రాలను అందుబాటులోకి తెనున్నట్టు వెల్లడించారు. డయాగ్నొస్టిక్ సెంటర్‌లో 57 రకాల పరీక్షలు చేస్తారని స్పష్టం చేశారు. సంగారెడ్డిలో 550కోట్లతో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీల నిర్మాణానికి మంజూరు అయ్యాయని మంత్రి హరీష్ తెలిపారు.

Tags:    

Similar News