Harish Rao: అబద్దాలు చెప్పడంలో బీజేపీకి డీఎన్‌ఏగా మారింది

Harish Rao: కిషన్‌రెడ్డి, బండి సంజయ్ స్థాయి ఏంటో ఢిల్లీ దూతలే చెప్పారు

Update: 2022-10-31 06:35 GMT

Harish Rao: అబద్దాలు చెప్పడంలో బీజేపీకి డీఎన్‌ఏగా మారింది

Harish Rao: తెలంగాణ బీజేపీ నాయకులు చేస్తున్న విమర్శలపై మంత్రి హరీష్‌రావు ఫైర్ అయ్యారు. కేసీఆర్ చండూరు సభ తర్వాత బీజేపీ నాయకులకు కంటి మీద కునుకు లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. బండి సంజయ్, కిషన్‌రెడ్డిలు దివాలకొరు, దిక్కుమాలిన నాయకులని హరీష్‌రావు విమర్శించారు. ఈ ఇద్దరి నేతల స్థాయి ఎంటో ఢిల్లీ నుంచి వచ్చిన దూతలు ఏం చెప్పారో విన్నామని హరీష్‌రావు గుర్తు చేశారు. బండి సంజయ్, కిషన్‌రెడ్డి మాట్లాడిన దాంట్లో ఒక్క నిజం లేదని అన్నారు. మునుగోడులో 99శాతం మందికి కేసీఆర్ సర్కార్ ఫలాలు అందాయని తెలిపారు. 

Full View


Tags:    

Similar News