ఉధృతంగా ప్రవహిస్తున్న జంపన్న వాగు..చిన్నారులు, భక్తులను రక్షించిన పోలీసులు
ములుగు జిల్లాలో జంపన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పస్రా, మేడారం మధ్య ప్రాజెక్టు నగర్ దగ్గర్లోని జంపన్న వాగులో సమ్మక్క సారమ్మ ఆలయానికి వెళ్లిన 15 మంది భక్తులు చిక్కుకున్నారు. దీంతో వెంటనే అలర్ట్ అయిన పోలీసులు వారిని సురక్షితంగా రక్షించారు. చిన్నారులను భుజాలపై మోసుకుని వాగును దాటించారు. దీంతో పోలీసుల కృషిని భక్తులతో పాటు స్థానికులు అభినందిస్తున్నారు.