మిరాకిల్ మిస్సింగ్.. రెండు లారీలు దూసుకొచ్చినా.. అతడు సేఫ్‌

Update: 2020-02-26 09:25 GMT
మిరాకిల్ మిస్సింగ్.. రెండు లారీలు దూసుకొచ్చినా.. అతడు సేఫ్‌

సంగారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. నిన్న రాత్రి సంగారెడ్డి జిల్లాలోని జాతీయ రహదారిపై ఓ వ్యక్తి రోడ్డు దాటే సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. అతడు రోడ్డు దాటే సమయంలో ఓ లారీ వేగంగా దూసుకొచ్చింది. అదే సమయంలో మరో లారీ రోడ్డు దాటే ప్రయత్నం చేయడం రెండు లారీలు ఎదురెదురుగా రావడం జరిగింది. అదే సమయంలో రెండు లారీలు బ్రేకులు వేయడంతో ఆ రెండు లారీలు ఆ వ్యక్తి వైపుకు దూసుకొచ్చాయి. ఇటు ప్రమాదం జరిగినట్లు గమనించిన వ్యక్తి ఒక్క ఉదుటన పరుగు అందుకున్నాడు.


Full View

 

Tags:    

Similar News