Jaanu సినిమా చూస్తూ వ్యక్తి మృతి

హైదరాబాద్ ఎర్రగడ్డలో విషాదం చోటు చేసుకుంది. ఎర్రగడ్డలోని ఓ సినిమా థియేటర్లో సినిమా చూసి వ్యక్తి మృతి చెందడం కలకలం రేపింది.

Update: 2020-02-08 07:33 GMT

హైదరాబాద్ ఎర్రగడ్డలో విషాదం చోటు చేసుకుంది. ఎర్రగడ్డలోని ఓ సినిమా థియేటర్లో సినిమా చూసి వ్యక్తి మృతి చెందడం కలకలం రేపింది. ఓ వ్యక్తి శుక్రవారం జాను సినిమా చూసేందుకు ఎర్రగ్డలో థియేటర్ కు వెళ్లాడు. సినిమా అయిపోయాక ప్రేక్షకులు అందరు వెళ్లిపోయినా.. అతను సీట్లో అలానే కూర్చుండిపోయాడు. దీంతో థియేటర్ సిబ్బంది వచ్చి చూస్తే ఓ వ్యక్తి సీట్లో ఉండటాన్ని చూశారు. సీట్లో అలానే అతడు నిద్రపోయాడేమోనని అనుమానంతో లేపేందుకు యత్నించారు.

ఎన్నిసార్లు పిలిచిన అతను చలించకపోవడంతో దగ్గరికి వచ్చి చూశారు. దాంతో అతను చనిపోయినట్లు గుర్తించారు. ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ మహేందర్‌ మృతదేహన్ని గాంధీ మార్చురీకి తరలించారు. అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు.

కాగా.. మృతి చెందిన వ్యక్తి ఎవరు అనేది మిస్టరీగా మారింది. అతడి జేబుల్లో తనిఖీ చేసిన పోలీసులకు..ఎలాంటి ఆధారాలు లభించలేదు. అతడు గుండె పోటుతో చనిపోయాడా.. గుండె పోటుతో మరణించాడా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్‌పెక్టర్‌ మురళీకృష్ణ వెల్లడించారు.

Tags:    

Similar News