Malla Reddy: భూ కబ్జా కేసుపై స్పందించిన మాజీ మంత్రి మల్లారెడ్డి
Malla Reddy: తనపై నమోదైన భూ కబ్జా కేసుపై మాజీ మంత్రి మల్లారెడ్డి స్పందించారు.
Malla Reddy: భూ కబ్జా కేసుపై స్పందించిన మాజీ మంత్రి మల్లారెడ్డి
Malla Reddy: తనపై నమోదైన భూ కబ్జా కేసుపై మాజీ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. భూ కబ్జా చేసినట్టు వస్తున్న వార్తలు అవాస్తవన్నారు. భూములు కబ్జా చేయాల్సిన అవసరం తనకు లేదని.. ఇతర వ్యక్తులు కబ్జా చేశారని తెలిపారు. గిరిజనుల 47 ఎకరాలకు సంబంధించిన భూమి విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. కొంతమంది మధ్యవర్తులు కొనుగోలు, అమ్మకాల్లో ఉన్నారని.. గిరిజనుల భూమిని వారే కబ్జా చేసి ఉంటారని ఆరోపించారు. భూ కబ్జా ఆరోపణలపై కోర్టులో తేల్చుకుంటానన్నారు మల్లారెడ్డి.