సికింద్రాబాద్‌లో మహంకాళి బోనాలు ప్రారంభం

Secunderabad: తొలి బోనం సమర్పించిన మంత్రి తలసాని కుటుంబం

Update: 2022-07-17 01:35 GMT

సికింద్రాబాద్‌లో మహంకాళి బోనాలు ప్రారంభం

Secunderabad: సికింద్రాబాద్‌లో మహంకాళీ బోనాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మంత్రి తలసాని కుటుంబంతో కలిసి తొలి బోనం సమర్పించారు. ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వేల సంఖ్యలో తరలి వస్తున్నారు. బోనాల సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఆలయ పరిసరాలు, క్యూలైన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహంకాళి బోనాలకు అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. బోనాలకు వచ్చే అందరికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ఇవాళ తొట్టెల ఊరేగింపు, ఫలహార బండ్ల ఊరేగింపు ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. రేపు రంగం తర్వాత అంబారి ఊరేగింపు ఉంటుందని చెప్పారు.

Tags:    

Similar News