టీఆర్ఎస్లో విస్తరణ మంటలు ఆగడం లేదు. పార్టీలో తానే సీనియర్నంటూ మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. అసెంబ్లీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన కేంద్ర మంత్రిని ఓడించిన చరిత్ర తనదన్నారు. మహబూబాబాద్ జిల్లాలో కాంగ్రెస్కు చోటు లేకుండా చేశానన్నారు. సత్యవతి రాథోడ్కు మంత్రిపదవి ఇవ్వటం ఎమ్మెల్యే రెడ్యానాయక్, ఎంపీ కవిత నిన్న కేటీఆర్ను కలిసి అసంతృప్తి వ్యక్తం చేయటంపై మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పరోక్షంగా స్పందించారు. పార్టీలోకి కొత్తగా వచ్చి పదవులు పొందిన వారే అలగటం ఏంటో తనకు అర్థం కావటం లేదని అన్నారు. 'నేను వారికన్నా పార్టీ సీనీయర్ని పైగా, కేంద్రమంత్రిగా పనిచేసిన నేతను ఓడించిన నాకు మంత్రి పదవి ఇవ్వాలి కదా' అని తన అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తంచేశారు.