Madan Mohan Rao: న్యాయం జరగాలంటే కాంగ్రెస్‌కు ఓటేసి గెలుపించాలి

Madan Mohan Rao: కేసీఆర్ పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు

Update: 2023-11-26 10:23 GMT

Madan Mohan Rao: న్యాయం జరగాలంటే కాంగ్రెస్‌కు ఓటేసి గెలుపించాలి

Madan Mohan Rao: ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ రావ్ అన్నారు. తాడ్వాయి, లింగంపేట్ మండలంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తొమ్మిదిన్నర ఏళ్ల కేసీఆర్ పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని ఆరోపించారు. ఎన్నికల్లో గెలిచిన తరవాత ఒక్క రూపాయి జీతంతో పనిచేసి వచ్చిన డబ్బులు ఇళ్ల నిర్మాణంకు వినియోగిస్తామన్నారు. బీఆర్ఎస్ పాలనలో అవినీతి పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్‌కు ఓటేసి గెలుపించాలని కోరారు.

Tags:    

Similar News