నిజామాబాద్‌లో లారీ చోరీ

Update: 2019-09-23 04:42 GMT

నిజామాబాద్ జిల్లాలో రేషన్ షాపులకు సరఫరా చేసే బియ్యం లారీ అపహరణకు గురయ్యింది. బోదన్ లో బియ్యం బస్తాలు ఖాళీ చేసి లారీని అపహరించుకుపోయారు. బీర్కుర్ మండలం సిద్దివినాయక బియ్యం మిల్లు నుంచి 270 క్వింటాళ్ల బియ్యం లారీలో బోదన్ కు తీసుకు వచ్చారు. ఎఫ్ సీఐ సిబ్బంది బస్తాలను ఖాళీ చేయిస్తుంది. వర్షం కురవడంతో లారీని వరుసలో పెట్టి డ్రైవర్ వెళ్లిపోయారు. తిరిగి వచ్చే సరికి లారీ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News