Telangana: లాక్‌డౌన్‌ పొడగింపు.. పెరిగిన సడలింపులు

Telangana: రాష్ట్రంలో మరో పదిరోజుల పాటు లాక్‌డౌన్‌ను ప్రభుత్వం పొడిగించింది.

Update: 2021-06-08 15:21 GMT

తెలంగాణలో లాక్‌డౌన్‌ పొడగింపు (ఫొటో ట్విట్టర్)

Telangana: రాష్ట్రంలో మరో పదిరోజుల పాటు లాక్‌డౌన్‌ను ప్రభుత్వం పొడిగించింది. ఈమేరకు ఉత్తర్వులను జారీ చేసింది. రేపట్నుంచి ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సడలింపులు ఇచ్చింది. ఉద్యోగాలకు వెళ్లిన ప్రజలకు ఒక గంట వెసులుబాలు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కాగా, సాయంత్రం 6నుంచి ఉదయం 6 గంటల వరకు కఠినంగా లాక్‌డౌన్‌ ను అమలుచేయనున్నట్లు పేర్కొంది. కాగా.....కరోనా పూర్తిగా అదుపులోకిరాని.. సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జున సాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాల గూడ, నియోజక వర్గాల పరిధిలో మాత్రం, లాక్ డౌన్ ఇప్పుడు కొనసాగుతున్న యదాతధ స్థితినే కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది.

Tags:    

Similar News