హైదరాబాద్ కూకట్పల్లిలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. ప్రగతినగర్ శివారు ప్రాంతంలో గల గుట్టలపై చిరుత తిరుగుతున్నట్లు గుర్తించిన వాకర్లు ఫోటో తీశారు. ఫోటోను జూమ్ చేసి చూడగా చిరుతలా కనిపించడంతో భయంతో వణికిపోయారు. వెంటనే ఫారెస్ట్ అధికారులను సమాచారం అందజేశారు. రంగంలోకి దిగిన అధికారులు చిరుత కోసం జల్లెడ పడుతున్నారు. మరోవైపు చిరుత సంచరిస్తున్నట్లు వార్తలు రావడంతో ప్రగతినగర్ వాసులు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.