కుమ్రంబీమ్ జిల్లా కాగజ్ నగర్ పేపర్ మిల్లు యాజమాన్యం, లారీ అసోసియేషన్ మద్య వివాదం తారాస్థాయికి చేరింది. లోకల్ లారీలను ట్రాన్స్ ఫోర్టుకు వినియోగించకుండా ఆంక్షలను నిరసిస్తూ లారీ యజమానులు లారీ తగలబెట్టారు. ఓ లారీ యజమాని ఉస్మాన్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించారు. లారీ యజమానులపై పోలీసులు లాఠీ చార్జ్ జరిపారు. పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది.