ఈ నెల 18న జరిగే దళిత,గిరిజన సభకు డుమ్మా కొట్టే ఆలోచనలో కోమటిరెడ్డి

* 17 నుంచి పార్లమెంట్‌ కమిటీ పర్యటనకు వెళ్లేందుకు సన్నాహాలు * టీ కాంగ్రెస్‌లో ముదురుతున్న దళిత దండోరా వివాదం

Update: 2021-08-13 08:30 GMT

కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి (ఫైల్ ఫోటో)

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో దళిత దండోరా వివాదం ముదురుతోంది. ఈనెల 18న భువనగిరి పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ పార్టీ చేపట్టే దళిత, గిరిజన ఆత్మగౌరవ సభకు కోమటిరెడ్డి వెంటక్‌రెడ్డి దూరంగా ఉండాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ సభకు ఒక్కరోజు ముందు అంటే 17 నుంచి 21వ తేదీ వరకు పార్లమెంట్‌ కమిటీ పర్యటనకు వెళ్లడానికి వెంకట్‌ రెడ్డి సిద్ధమవుతున్నారు. గోవా, ముంబై‌, పార్లమెంట్‌ బిగ్గు, ఇసుక స్టాండింగ్‌ కమిటీ పర్యటనకు వెళ్తున్నట్లు ఆయన నియోజకవర్గం పార్టీ గ్రూపుల్లో మెసేజ్‌లు పెడుతున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News